సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
యాదగిరిగుట్ట: మండలంలోని వంగపల్లిలో గ్రామానికి చెందిన ఎడవెల్లి స్రవంతి, గాయత్రిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, పీఆర్డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సాంబశివరావు, పీఆర్ ఏఈ సుగుణాకర్, వంగపల్లి సర్పంచ్ చంద్రగాని నిరోష, ఉపసర్పంచ్ రేపాక స్వామి తదితరులున్నారు.
సంబంధిత వార్తలు