దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం | Sakshi
Sakshi News home page

దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం

Published Wed, Oct 5 2016 1:25 AM

దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం

  • -మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌
  • కోట:
    వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్‌ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో పోర్టుకు అనుకూలంగా చట్టం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోర్టు రాకుండా అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పోర్టు సాధన కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఆయన వెంట పుచ్చలపల్లి సర్పంచ్‌ ఇంధ్రసేనయ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంకయ్య, కోట, వాకాడు మండలాల నాయకులు ఉన్నారు.
     
     
     

Advertisement
Advertisement