టెక్కలిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న లోకనాథం తరపు న్యాయవాదులు.
టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథంపై సుమారు 23 సంవత్సరాల కిందట నమోదు చేసిన హత్య కేసును సోంపేట కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి బబితా గురువారం కొట్టివేసినట్లు ఆయన తరఫున వాదించిన న్యాయవాదులు బి.ఆర్.వి.ఎల్.నారాయణపాత్రో, ఎం.సుధాకర్ తెలిపారు.
టెక్కలి : టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథంపై సుమారు 23 సంవత్సరాల కిందట నమోదు చేసిన హత్య కేసును సోంపేట కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి బబితా గురువారం కొట్టివేసినట్లు ఆయన తరఫున వాదించిన న్యాయవాదులు బి.ఆర్.వి.ఎల్.నారాయణపాత్రో, ఎం.సుధాకర్ తెలిపారు.
టెక్కలిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 1993 సెప్టెంబర్ 7న టెక్కలికి చెందిన కోళ్ల వాసుదేవరావును సత్తారు లోకనాథం కత్తితో పొడిచి హత్య చేసినట్లు వాసుదేవరావు సోదరుడు కోళ్ల ఎర్రన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీస్స్టేషన్లో అప్పట్లో కేసు న మోదు చేశారని వెల్లడించారు. ఈ కేసులో 12 మందిపై కేసు నమోదు చేయగా సత్తారు లోకనాథంనాయుడును ఎ2గా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోంపేట కోర్టులో కేసు కొనసాగుతూ చివరగా కొట్టి వేసినట్లు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలుగా నమోదైన వారిలో ఇప్పటికే నలుగురు మృతి చెందారని వెల్లడించారు. అనంతరం లోకనాథంనాయుడు మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్ష వలనే తనను ఇటువంటి కేసులో ఇరికించారని తెలిపారు. కేసు కొట్టి వేయడంతో లోకనాథం కుమారుడు రమణ, మనవడు కిరణ్తో పాటు అనుచరులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.