కేతకిలో కోడెల వేలం | calves auction at kethaki | Sakshi
Sakshi News home page

కేతకిలో కోడెల వేలం

Oct 4 2016 6:13 PM | Updated on Sep 4 2017 4:09 PM

కేతకిలో కోడెల వేలం వేస్తున్న అధికారులు

కేతకిలో కోడెల వేలం వేస్తున్న అధికారులు

జిల్లాలో సుప్రసిద్దమైన శైవక్షేత్రమం ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో కోడెలను వేలం వేశారు.

ఝరాసంగం: జిల్లాలో సుప్రసిద్దమైన శైవక్షేత్రమం ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో కోడెలను వేలం వేశారు. గత వారం రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కానుక రూపంలో ఆలయానికి సమర్పించిన లేగదూడలను మంగళవారం ఆలయ ఆవరణలో బహిరంగ వేలం వేశారు.

భక్తులు సమర్పించిన ఐదు కోడెలను వేలం వేయగా రూ.16,300 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భుజంగం, విజయ్‌కుమార్‌, అర్చకుడు బసయ్యస్వామి గ్రామస్థులు సిద్ధయ్యస్వామి, మల్లేషం, మిట్టు, ప్రకాశ్‌సింగ్‌, బండయ్యస్వామి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement