ఆ సర్వే రాజకీయ కుట్ర: విష్ణుకుమార్‌రాజు | Sakshi
Sakshi News home page

ఆ సర్వే రాజకీయ కుట్ర: విష్ణుకుమార్‌రాజు

Published Fri, Dec 2 2016 3:28 AM

ఆ సర్వే రాజకీయ కుట్ర: విష్ణుకుమార్‌రాజు - Sakshi

సీతమ్మధార (విశాఖ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేస్తే 120 సీట్లు వస్తాయని, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్లు వస్తాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక సర్వే పేరుతో ప్రచురించిన కథనం రాజకీయ కుట్ర అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ఇది డబ్బులు ఇచ్చి చేయించుకున  కిరాయి సర్వే అని మండిపడ్డారు. గురువారం అయన విలేకర్లతో మాట్లాడారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఈ సర్వే కరెక్ట్ అని భావించి ఆ మేరకు ఒక ప్రకటన చేస్తే, తాము తమ కార్యాచరణను రూపొందించుకుంటామని విష్ణుకుమార్‌రాజు తెలిపారు. 

Advertisement
Advertisement