దేవరకద్ర : మండల కేంద్రంలోని శివాలయం, వీరప్పయ్యస్వామి దేవాలయాల్లో శ్రావణ మాసం ప్రారంభం నుంచి అఖండ దీపారాధన కొనసాగుతున్నది.
కొనసాగుతున్న అఖండ దీపారాధన
Aug 12 2016 8:58 PM | Updated on Sep 4 2017 9:00 AM
దేవరకద్ర : మండల కేంద్రంలోని శివాలయం, వీరప్పయ్యస్వామి దేవాలయాల్లో శ్రావణ మాసం ప్రారంభం నుంచి అఖండ దీపారాధన కొనసాగుతున్నది. శుక్రవారం ఘనంగా పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో నిత్యం అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రతి రోజు రాత్రివేళ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖండ దీపాలు 41 రోజుల పాటు నిరంతరం వెలిగిస్తారు. భజనలు, అఖండ దీపారాధన కార్యక్రమాలు శ్రావణ మాసం ముగిసిన తరువాత మరో 11 రోజుల వరకు కొనసాగుతాయి.
Advertisement
Advertisement