16నుంచి జిల్లాలో బీసీ కమిషన్‌ పర్యటన | bc commission tour in anantapur on 16th | Sakshi
Sakshi News home page

16నుంచి జిల్లాలో బీసీ కమిషన్‌ పర్యటన

Oct 14 2016 12:08 AM | Updated on Sep 4 2017 5:05 PM

రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుందని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అర్బన్‌ : రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుందని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కె.ఎల్‌.మంజునాథ్‌ సార థ్యంలో సభ్యులు 16వ తేదీ సాయంత్రం 6.30  జిల్లాకు చేరుకుని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. 17వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 10.15 వరకు కలెక్టర్, ఎస్పీలతో కుల ద్రువీకరణ పత్రాలు, క్రిమిలేయర్, ప్రజా సాధికార సర్వే అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు.

10.30  నుంచి లలిత కళాపరిషత్‌లో రాష్ట్ర బీసీ జాబితాలో చేర్పులు, మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారన్నారు. 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. అనంతరం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement