పురాతన ఆలయాల పునర్నిర్మాణం | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయాల పునర్నిర్మాణం

Published Sun, Jan 15 2017 9:40 PM

పురాతన ఆలయాల పునర్నిర్మాణం - Sakshi

కోవెలకుంట్ల: సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కుందూ వరదలతో కనుమలపాడు అనే గ్రామం కాలగర్భంలో కలిసిపోగా.. ఆ గ్రామానికి  సంబం«ధించిన పురాతన ఆలయాలను ఇటీవల పునర్నిర్మించారు. కోవెలకుంట్ల పట్టణ శివారులోని ప్రస్తుతం పాటి ఆంజనేయస్వామిగా పిలుస్తున్న ప్రాంతంలో కనుమలపాడు గ్రామం ఉన్నట్లు పూర్వీకుల చరిత్ర. ఈ  గ్రామానికి ఒక వైపు ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, మరో వైపున భైరవుడి దేవాలయాలు ఉన్నాయి. భైరవ దేవాలయ సమీపంలోని కోనేటిలో ప్రజలు స్నానాలు చేసి ఆయా ఆలయాల్లోని దేవుళ్లకు పూజలు చేసేవారు.  ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పట్టణానికి చెందిన పవన్‌ ఏజెన్సీ నిర్వాహకులు స్పందించారు. ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయాన్ని పునర్నిర్మించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement