మండలం కోసం ఆత్మహత్యాయత్నం | A man attempted seucide for mandal | Sakshi
Sakshi News home page

మండలం కోసం ఆత్మహత్యాయత్నం

Oct 13 2016 4:00 AM | Updated on Aug 29 2018 4:18 PM

గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు

చండూరు: గట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. గట్టుప్పల గ్రామానికి చెందిన ఏర్పుల యూదయ్య బుధవారం ఉదయం స్థానికంగా నిర్వహిస్తున్న దీక్ష వద్దకు చేరుకున్నాడు. తొలుత గట్టుప్పలను మండలంగా ప్రకటించి ముసాయిదాలో ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ జై తెలంగాణ అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈ విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ రమేష్‌కుమార్ స్థానికులతో కలిసి మంటలు ఆర్పించి ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిపోయిన యూదయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement