ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ద్వితీయæ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ థర్డ్ పేపర్ పరీక్షల్లో 823 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ద్వితీయæ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ థర్డ్ పేపర్ పరీక్షల్లో 823 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 31,790 మంది విద్యార్థులకుగాను 30,967 మంది హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 29,463 మందికిగానూ 28,716 మంది హాజరవగా 747 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 2,327 మందికిగానూ 2,251 మంది హాజరయ్యారు. 76 మంది గైర్హాజరయ్యారు.