29 నుంచి బ్యాడ్మింటన్‌ టోర్నీ | 29 onwards badmintion torny | Sakshi
Sakshi News home page

29 నుంచి బ్యాడ్మింటన్‌ టోర్నీ

Jul 24 2016 7:00 PM | Updated on Sep 4 2017 6:04 AM

ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కృష్ణా జిల్లా కార్యదర్శి త్రిమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అండర్‌–13, 15, 17, 19 విభాగాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి టోర్నీకి పంపిస్తామని చెప్పారు.

ఆటోనగర్‌ : 
ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కృష్ణా జిల్లా కార్యదర్శి త్రిమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అండర్‌–13, 15, 17, 19 విభాగాల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి టోర్నీకి పంపిస్తామని చెప్పారు. ఒక్కో క్రీడాకారుడు మూడు విభాగాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. విజయవాడలోని ఫన్‌టైమ్స్, ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఫన్‌టైమ్స్‌ క్లబ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఫన్‌టైమ్స్‌ అధ్యక్షుడు రామినేని రామ్మోహన్, జేఎన్‌ శంకరగుప్తా, సాంబశివరావు, విజయ్‌బాబు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement