యువతి అనుమానాస్పద మృతి

Young Woman Suspicious Death in Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం : ఇష్టపడిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నెలమంగల పరిధిలో చోటుచేసుకుంది. గీతా (22) నెలమంగల సమీపంలోని గోల్డెన్‌ సిమ్‌ గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఈమె స్వంత ఊరు శివమొగ్గ జిల్లా సాగర తాలూకా. గత రెండు సంవత్సరాలుగా వికాస్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వికాస్‌ కూడా అదే గార్మెంట్స్‌లో పనిచేసస్తున్నాడు. ఇలా ఉండగా గీతా శుక్రవారం ఉదయం ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకుని మృతి చెందింది. అయితే వికాస్‌ తమ కూతురిని అత్యాచారం చేసి హత్యచేసాడని గీతా తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికాస్‌ తమ కూతురి నుండి ఇప్పటికే రూ 3.లక్షలు మాయచేసి ఇప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. నెలమంగల పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top