గొంతులో బజ్జీ ఇరుక్కుని మహిళ మృతి | Woman Died With Mirchi Bajji Struck in Throat Tamil Nadu | Sakshi
Sakshi News home page

గొంతులో బజ్జీ ఇరుక్కుని మహిళ మృతి

Jan 4 2020 10:45 AM | Updated on Jan 4 2020 10:45 AM

Woman Died With Mirchi Bajji Struck in Throat Tamil Nadu - Sakshi

చెన్నై,తిరువొత్తియూరు: బజ్జీ గొంతులో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. చూలైమేడు కామరాజర్‌ నగర్‌కు చెందిన పద్మావతి (45) గురువారం రాత్రి బజ్జీలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి విలవిలలాడింది. కుటుంబ సభ్యులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూలైమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement