భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి

Three Terrorists Shot Dead In Encounter In Kashmir - Sakshi

శ్రీనగర్‌(జమ్మూ కశ్మీర్‌): కుల్లాం జిల్లా లారో ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని భద్రతా బలగాలకు సమాచారం రావడంతో సంఘటనాస్థలానికి వచ్చి సెర్చ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు జవానులు గాయపడ్డారు.

ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపేశారు. సంఘటనాస్థలం నుంచి ఏకే-47, అండర్‌ బారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌, మూడు గ్రెనేడ్‌లు, రెండు చైనా పిస్టళ్లు, మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెల్సిందే.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top