భూమి పట్టా చేయడంలేదని ఆత్మహత్యాయత్నం

సారంగాపూర్: కరీంనగర్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చిట్యాల గంగయ్య అనే వ్యక్తి 2001లో సర్వే నంబర్ 210లో ఎకరం భూమిని జితేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అతను చనిపోవడంవతో ఆ భూమి తమదేనని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని, భూమి పట్టా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అతను ఆత్మహత్యకు యత్నించాడు. ఇతనిని ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top