వోల్వో బస్సు- ఆటో ఢీ.. ఒకరు మృతి
సాక్షి, విజయనగరం : జిల్లాలోని దత్తిరాజేరు మండలం మరడాం సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివి.. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు, ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వ్యక్తి మరడాం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లాగా(19) స్థానికులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.