ఇంటర్‌ చదవడం ఇష్టం లేక.. | Minor Girl Commits Suicide in Kurnool | Sakshi
Sakshi News home page

చదువుకోవడం ఇష్టం లేక..

Jul 18 2020 10:45 AM | Updated on Jul 18 2020 10:45 AM

Minor Girl Commits Suicide in Kurnool - Sakshi

విజయలక్ష్మి (ఫైల్‌)

కర్నూలు,మద్దికెర : ఇంటర్‌ చదవడం ఇష్టం లేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది.  మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో  శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మృతురాలు విజయలక్ష్మి (16) ఎం. అగ్రహారం గ్రామంలోని అవ్వాతాతల వద్ద ఉండి చదువుకుంటుంది. తల్లిదండ్రులు నాగవేణి, శంకర్‌  హైదరాబాద్‌లో ఉంటారు. ఈ ఏడాది పదవతరగతి పూర్తికావడంతో ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కుమార్తెకు చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడం ఇష్టం లేని ఆ బాలిక శుక్రవారం ఇంట్లో  ఉరి వేసుకుంది.  గమనించిన కుటుంబసభ్యులు  వైద్య చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించేలోపు  మృతిచెందింది. ఈమేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు మద్దికెర పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement