పెళ్లి వ్యాను బోల్తా | Marriage Bus Skids Off Road At Nacharam In Siddipet District | Sakshi
Sakshi News home page

పెళ్లి వ్యాను బోల్తా

Nov 23 2019 9:41 AM | Updated on Nov 23 2019 9:41 AM

Marriage Bus Skids Off Road At Nacharam In Siddipet District - Sakshi

సాక్షి, గజ్వేల్‌: టాటా ఏస్‌ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్‌ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్‌ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్‌ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement