అత్తింట్లో అల్లుడు అనుమానాస్పద మృతి

Man Suspicious death in Uppal - Sakshi

ఉప్పల్‌: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్, ఎన్‌ఆర్‌నగర్‌కు చెందిన కిన్నెరస్వామి (35) డ్రైవర్‌గా పని చేసేవాడు. పదేళ్ల క్రితం అతడికి రామంతాపూర్‌ కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. డిసెంబర్‌ 31న కిన్నెర స్వామి భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లివచ్చిన కొద్ది సేపటికే అతను ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా స్వామి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు శ్రీనివాస్‌ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top