భార్య, కూతుళ్లపై యాసిడ్ దాడి.. ఆపై!

Man Acid Attack On Wife And Daughters Then Drink It - Sakshi

న్యూఢిల్లీ : భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కుటుంబంపై యాసిడ్‌ దాడికి పాల్పడి చివరికి తాను సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని కర్వాల్‌ నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానికంగా నివాసం ఉండేవాడు. గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. దీంతో ఆవేశంగా బయటకు వెళ్లిపోయిన భర్త యాసిడ్‌ బాటిల్స్‌ కొని నేరుగా ఇంటికొచ్చాడు.

తొలుత భార్యపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ అతడు తర్వాత ఇద్దరు కుమార్తెలపై కూడా యాసిడ్‌ పోశాడు. ఆపై ఆ వ్యక్తి యాసిడ్‌ తాగి బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి భర్త చనిపోయాడు. ఆ వ్యక్తి భార్య 40 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉండగా.. వారి కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జీటీబీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top