అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ | DSP Inquiry on atrocity case | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

Apr 28 2018 12:47 PM | Updated on May 25 2018 5:49 PM

DSP Inquiry on atrocity case - Sakshi

విచారణ చేస్తున్న డీఎస్పీ స్వరూపారాణి, సీఐ శ్రీనివాసరావు  

భామిని: ఎస్టీ వివాహితను మోసగించాడన్న ఫిర్యాదుపై పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి దర్యాప్తు చేశారు. భామిని మండలం చిన్నదిమిలి కాలనీలో డీఎస్పీ స్వరూపారాణి, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు శుక్రవారం విచారణ చేపట్టారు. వివాహిత ఎడ్ల పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నదిమిలి కాలనీకి చెందిన యువకుడు టి.మనోజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు, వీఆర్‌ఓ కె.బాలరాజు, వార్డు సభ్యులు ఎ.యశోద, గ్రామస్తులు ఉన్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement