నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

DRI Officers Seized 4 Kgs Gold From Passengers In Shamshabad Airport - Sakshi

సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 4 కేజీల బంగారాన్ని గురువారం డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 800 గ్రాములు, మస్కట్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 700 గ్రాములు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కేజిన్నర బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారి వద్ద ఉన్న బంగారానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top