4జీ ఫోన్లపై వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

4జీ ఫోన్లపై వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Published Fri, Dec 1 2017 8:50 AM

Vodafone Now Offering Rs. 2,200 Cashback on Select Micromax 4G Smartphones   - Sakshi

ఎంపికచేసిన మైక్రోమ్యాక్స్‌ 4జీ స్మార్ట్‌ఫోన్లపై టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. మైక్రోమ్యాక్స్‌తో కొత్త భాగస్వామ్యం ఏర్పరుచుకుంటున్నట్టు గురువారం ప్రకటించిన వొడాఫోన్‌, ఈ మేరకు క్యాష్‌బ్యాక్‌ వివరాలను కూడా వెల్లడించింది. గురువారం ప్రకటించిన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లలో మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 2 ప్లస్‌, మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 3, మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 4, మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ 1 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వొడాఫోన్‌ కొత్త, పాత కస్టమర్లు పైన పేర్కొన్న ఆ నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్‌ రీఛార్జ్‌లు చేయించుకోవాలి. ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్‌, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు. సబ్‌స్క్రైబర్‌ వొడాఫోన్‌ ఎం-పెసా వాలెట్‌లో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని క్రెడిట్‌ చేయనున్నారు.  గత నెలలో కూడా వొడాఫోన్‌, మైక్రోమ్యాక్స్‌లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ రూ.999కే అందుబాటులోకి వచ్చింది. 

మోడల్‌ పేరు                               భారత్‌2 ప్లస్‌   భారత్‌ 3       భారత్‌ 4       కాన్వాస్‌ 1 
18 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్‌      రూ.900       రూ.900         రూ.900       రూ.900    
 36 నెలల అనంతరం క్యాష్‌బ్యాక్‌     రూ.1300     రూ.1300       రూ.1300      రూ.1300
 మార్కెట్‌ ఆపరేటింగ్‌ ధర               రూ.3749     రూ.4499       రూ.4999      రూ.5999        
  మొత్తం క్యాష్‌బ్యాక్‌                     రూ.2200      రూ.2200       రూ.2200      రూ.2200
  తుది ధర                                 రూ.1549     రూ.2299       రూ.2799       రూ.3799

Advertisement

తప్పక చదవండి

Advertisement