భారీగా కోలుకున్న రూపాయి | Rupee rises over 26 paise | Sakshi
Sakshi News home page

భారీగా కోలుకున్న రూపాయి

Aug 6 2019 2:44 PM | Updated on Aug 6 2019 3:51 PM

Rupee rises over 26 paise - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి కోలుకుంది. ఇటీవలి నష్టాల నుంచి భారీగా పుంజుకున్న రూపాయి మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే సానుకూల సంకేతాలిచ్చింది. డాలరు మారకంలో 25 పాయింట్లు లాభపడి అయిదు నెలల కనిష్టంనుంచి  కోలుకుంది.  సోమవారం నాటి ముగింపు 70.60 తో పోలిస్తే 70.47 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. అనంతరం నష్టాల్లోకి జారుకున్న రుపీ ప్రస్తుతం 70.73వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది.  గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా  సోమవారం ఏకంగా 113 పైసలు నష్టపోయిన సంగతి తెలిసిందే. 

ఈక్విటీ మారెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా   పుంజుకోగా, నిఫ్టీ 140 పాయింట్లు ఎగిసింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement