మూడో రోజూ పుంజుకున్న రూపాయి | Rupee firms up by 25 paise to 66.50 | Sakshi
Sakshi News home page

మూడో రోజూ పుంజుకున్న రూపాయి

Mar 19 2016 1:05 AM | Updated on Oct 4 2018 8:05 PM

రూపాయి లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలు బలపడి

ముంబై: రూపాయి లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలు బలపడి 66.50కు చేరింది. ఇది రెండున్నర నెలల గరిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ డాలర్‌తో రూపాయి మారకం బలపడింది. విదేశీ నిధులు వస్తున్న కారణంగా బ్యాంక్‌లు, ఎగమతిదారులు డాలర్లను విక్రయిస్తుండడం, స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం రూపాయి పుంజుకోవడానికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. గత మూడు రోజుల్లో రూపాయి 88 పైసలు(1.31 శాతం) బలపడింది.

Advertisement
 
Advertisement
Advertisement