వావ్‌...మార్కెట్లకు మూడీస్‌ బూస్ట్‌ | Moody's upgrade boost to stock markets | Sakshi
Sakshi News home page

వావ్‌...మార్కెట్లకు మూడీస్‌ బూస్ట్‌

Nov 17 2017 9:18 AM | Updated on Nov 17 2017 9:25 AM

Moody's upgrade boost to stock markets - Sakshi - Sakshi


సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంస్థ  రేటింగ్‌   సంస్థ మూడీస్‌  భారత్‌ ఆర్థిక వ్యవస్థకు బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి అప్‌గ్రేడ్‌తో మార్కెట్లు జోష్‌గా స్టార్ట్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభంతో 33,498 వద్ద  నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో10,334  ట్రేడ్‌అవుతున్నాయి.   ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని సెక్టార్లకు లాభాలే. ఇన్ఫీ టాప్‌ లూజర్‌గా వుండగా, ఎస్‌బీఐ టాప్‌  గెయినర్‌గా లాభాలను  ఆర్జిస్తోంది.

సంస్థాగత సంస్కరణల ద్వారా అభివృద్ధి చెందుతున్నభారత్‌ ఆర్ధిక వ్యవస్థలో అభివృద్ధి వృద్ధి అవకాశాలను మూడీస్‌ సూచించింది. స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌కు తన రేటింగ్‌ను సవరించింది. దాదాపు 13 సంవత్సరాల విరామం తరువాత రేటింగ్ అప్‌గ్రేడ్‌ చేయడంతో మార్కెట్లకు బూస్ట్‌ ఇచ్చింది. మరోవైపు మూడీస్‌ అప్‌గ్రేడ్‌పై రాకేష్ ఝన్‌ ఝన్‌ వాలా కూడా స్పందించారు. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement