న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రజ్ఞా సామర్థ్యం(ఐక్యూ-ఇంటెలిజెంట్ కోషెంట్) కంటే.. చేసే పనిపై అమితాసక్తి(ఈక్యూ-ఎమోషనల్ కోషెంట్)దే పైచేయి అవుతుందని విద్యార్థులకు సత్య నాదెళ్ల ఉద్బోధించారు. ‘విద్యార్థులు తాము ఎంచుకున్న మార్గం.. పని.. ఏదైనా అత్యంత ఇష్టపూర్వకంగా చేయడం చాలా ముఖ్యం. పనిని ప్రేమించాలి. అప్పుడు అది ఎంతటి కష్టమైనదైనా అత్యంత సులువైనదిగా మారిపోతుంది.
అదేవిధంగా ఎలాంటి ఉన్నతమైన స్థానాలకు వెళ్లినా కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మానొద్దు’ అని సత్య చెప్పారు. భారత్ పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ దేశవ్యాప్తంగా 35 వేల మంది విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 20 రాష్ట్రాలు.. 300 నగరాల్లో 750కి పైగా ప్రాంతాల నుంచి విద్యార్థులు సత్యతో లైవ్ సంభాషణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు.
అద్భుత అనుభూతి...
భారత్లోని యువతరంతో మాట్లాడటం నిజంగా అద్భుత అనుభూతిగా సత్య అభివర్ణించారు. ‘ప్రతిరోజునూ మీ జీవితంలో చివరిరోజుగానే భావించి ముందుకెళ్లాలి. అయితే, జీవితకాలంపాటు గుర్తుండిపోయేలాగానే ఏదైనా నేర్చుకోవాలి’ అన్న మహాత్మా గాంధీ మాటలను విద్యార్థులకు సత్య గుర్తు చేశారు. దేశంలోని యువతలో ఉన్న శక్తి, ఆశావహ దృక్పథాన్ని చూస్తుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు.
‘ఈ ప్రపంచాన్ని మార్చాలని భావిస్తున్నారా.. మీ ముందు అపారమైన అవకాశాలున్నాయి. వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తే భవిష్యత్తును మార్చడం సాధ్యమే. మొబైల్ ఫస్ట్.. క్లౌడ్ ఫస్ట్ అనే వినూత్న ఆలోచన అటువంటిదే. మొబైల్ అనేది ఒక డివైజ్(పరికరం) కాదు.. ఇప్పుడు వ్యక్తే మొబైల్గా మారుతున్నాడు’ అని సత్య వ్యాఖ్యానించారు. కాగా, చిన్నతనంలో తన ఆలోచనల గురించి చెబుతూ.. ‘ముంబైని దాటి వెళ్తానని నేను అనుకోలేదు.
అయితే, చివరకు వాషింగ్టన్లో అడుగుపెట్టాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశా. ఇదేమీ ఆషామాషీ ప్రస్థానం కాదు. నా జీవితంలో... నేను ఎంచుకున్న దారిలో... నా అభిరులు, నన్ను నేను మలచుకున్నతీరే ఈ స్థానానికి(మైక్రోసాఫ్ట్ సీఈఓగా) నన్ను చేర్చింది’ అని సత్య విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు.
చేసే పనిని ప్రేమించండి: సత్య
Published Wed, Oct 1 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement