జియో న్యూ స్కీం: మోర్ డేటా, మోర్ డిస్కౌంట్స్
అన్ని ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్లపై అదనపు డేటా
రూ. 300లకు పైన రీచార్జ్లపై రూ.100 డిస్కౌంట్
రూ.300లోపు రీచార్జ్లపై 20శాతం డిస్కౌంట్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. 799 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్ను జియో కస్టమర్లకు అందబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లో రోజుకు 6.5జీబీ డేటాను అందిస్తోంది. రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్పై జియో యూజర్లు 182 జీబీ హై-స్పీడ్ 4జీడేటాను పొందవచ్చని జియో విడుదల చేసిన ఒక ప్రకటన లో వెల్లడించింది.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లానన్పై అదనపు డేటా ప్రయోజనాలను అదిస్తున్నది. 28 రోజులు వాలిడిటీతో రోజుకు 6.5జీబీ హై-స్పీడ్ 4 జి డేటా ఉచితం. ఇంకా అన్లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్లు ఉచితం. జూన్ 30వరకు ఈ ప్లాన్ రీచార్జ్కు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.
అంతేకాదు 300 రూపాయలు, ఆపైన రీచార్జ్లపై 100 డిస్కౌంట్ను, రూ.300లోపు రీచార్జ్లపై 20శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. అయితే రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాస్తవంగా 28 రోజుల వ్యవధిలో రోజుకు 5జీబీ డేటా చొప్పున 140జీబీ డేటాను అందిస్తుంది. తాజా రివ్యూ అనంతరం రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా ఆఫర్ చేస్తోందన్నమాట. కాగా రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర రీచార్జ్ప్లాన్లపై రోజుకు వాస్తవంగా అందిస్తున్న 4 జీజీ డేటా ఆఫర్ను పెంచిన సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు