ఇది ఎతిహాద్ ‘రేసు గుర్రం’! | ethihadh cargo is special in indian aviation show | Sakshi
Sakshi News home page

ఇది ఎతిహాద్ ‘రేసు గుర్రం’!

Mar 17 2016 1:04 AM | Updated on Sep 3 2017 7:54 PM

బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఇండియన్ ఏవియేషన్ షోలో ఎతిహాద్ కార్గో స్పెషల్ అట్రాక్షన్..

ఒకే ట్రిప్పులో 78 గుర్రాలను మోసుకెళుతుంది..
ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణ

బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఇండియన్ ఏవియేషన్ షోలో ఎతిహాద్ కార్గో స్పెషల్ అట్రాక్షన్. గంటకు పదివేల లీటర్ల ఇంధనం బర్న్ అయ్యే ఈ బోయింగ్ 777 ఫ్రైటర్‌కు ఏకంగా 78 గుర్రాలను అలవోకగా ఓ దేశం నుంచి మరో దేశానికి తరలించగలిగే సామర్థ్యముంది. ఈ ఫ్లైట్‌లో 550 క్యూబిక్ మీటర్ల స్పేస్ వుంది. గుర్రాలను తీసుకెళ్లేటప్పుడు వాటి కాళ్లను అటుఇటు కదలకుండా ఉండేందుకు లాక్ సిస్టమ్ కూడా ఉంది. గుర్రాలతో పాటు ఈ కార్గో ఫ్లైట్ ఫార్మాప్రొడక్ట్స్‌ను ఎక్కువగా రవాణా చేస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులకు వారంలో 14 సర్వీసులను నిర్వహిస్తున్న ఈ విమానం ఏటా 1,20,000 టన్నుల సామగ్రిని భారత్ నుంచి తరలి స్తోంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్రైట్ మార్కెట్‌లో దీనికి 9% వాటా ఉంది.

మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Advertisement
 
Advertisement
Advertisement