చిన్న విమానాశ్రయాల నుంచి కార్గో: జయంత్‌ సిన్హా

Air cargo will help economy grow, says Jayant Sinha - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం భారత ఎయిర్‌ కార్గో రంగంలో టాప్‌–10 ఎయిర్‌లైన్స్‌ హవా నడుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ సరుకు రవాణా విషయంలో వీటి వాటా ఏకంగా 65 శాతమని విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు.

ఈ విమానాశ్రయాలపై భారం తగ్గించడానికి చిన్న విమానాశ్రయాల నుంచి సరుకు రవాణాను ప్రోత్సహిస్తామని చెప్పారు. ‘ఎయిర్‌ కార్గో దేశంలో ఏటా 15% వృద్ధి చెందుతోంది. వార్షికంగా 3.7 లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. వ్యవసాయ, ఆహార, ఫార్మా, చర్మ సంబంధ ఉత్పత్తులు, వస్త్రాలు వీటిలో అధికం’ అని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top