'అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే' | ysrcp takes on tdp for red sanders smugglers | Sakshi
Sakshi News home page

'అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే'

May 4 2015 4:22 PM | Updated on Aug 10 2018 8:13 PM

'అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే' - Sakshi

'అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే'

ఎర్రచందనం స్మగ్లర్లతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధాలున్నట్లు ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది.

చిత్తూరు:ఎర్రచందనం స్మగ్లర్లతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధాలున్నట్లు ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది. వైఎస్సార్ సీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు, టీడీపీ నేతలు లేని పోని ఆరోపణలకు తెరలేపుతున్నారని వైఎస్సార్ సీపీ పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,  దేశాయి తిప్పారెడ్డిలు విమర్శించారు. ఎర్రచందనంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపించడం తగదని వారు సూచించారు.

 

అవరసరమైతే స్మగ్లర్లు ఎవరు అనే దానిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఎర్రచంద్రనం దొంగలు టీడీపీ నేతలేనని రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డిలు తీవ్రంగా మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement