శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు.
'పత్తి రైతులను ఆదుకోవాలి'
Dec 2 2015 2:15 PM | Updated on Sep 2 2018 4:48 PM
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు. నష్ట పోయిన పత్తి రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినందున ప్రతి సెంటు పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.
Advertisement


