రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్సీపీ నిరసన | ysrcp leaders protest on railway budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్సీపీ నిరసన

Feb 26 2015 5:56 PM | Updated on May 25 2018 9:20 PM

కేంద్ర రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు.

విశాఖపట్నం (అల్లిపురం): కేంద్ర రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. గురువారం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement