అక్రమ ఇసుక రవాణ...వైఎస్పార్‌సీపీ ధర్నా | YSRCP Dharna For Against Illegal Sand Mining | Sakshi
Sakshi News home page

అక్రమ ఇసుక రవాణ...వైఎస్పార్‌సీపీ ధర్నా

May 3 2018 1:21 PM | Updated on Aug 28 2018 8:41 PM

YSRCP Dharna For Against Illegal Sand Mining - Sakshi

సాక్షి, తాళ్లపుడి: నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణ చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకురాలు తానేటి వనిత ఆధ్యర్యంలో తాడిపుడి ఇసుక ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న లారీలను పార్టీశ్రేణులు అడ్డుకోవడంతో ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ..మంత్రి జవహర్‌ అండతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కన్నుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా ఇసుక తరలించే ముఠాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement