విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌ | ys jaganmohan reddy reaches to vizag over visitation to train accident victims | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌

Jan 23 2017 11:20 AM | Updated on Apr 4 2018 9:25 PM

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌ - Sakshi

విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌

రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ సోమవారం విశాఖ చేరుకున్నారు.

విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డుమార్గం ద్వారా విజయనగరానికి బయల్దేరారు.

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం జరిగిన కూనేరు ఘటనా స్థలాన్ని వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తారు. క్షతగ్రాతులతో పాటు ప్రమాద ఘటనలో మరణించిన పాత్రబిల్లి శ్రీను, పోలిశెట్టి, మిరియాల కృష్ణ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement