సాక్షి, అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. సోమవారం ఏపీ జేఏసీ (అమరావతి) చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ సీఎం తొలిసారి ఉద్యోగ సంఘాల నాయకులను కలిసినప్పుడు చెప్పిన మాట ప్రకారం తొలి కేబినెట్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన అనేక సానుకూల నిర్ణయాలు ప్రకటించడం అభినందనీయమన్నారు. పే రివిజన్ కమిటీ నివేదిక సమర్పించేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం, జులై 1వ తేదీ నుంచి పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు ఎంతో మేలుచేస్తుందన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న సీపీఎస్ రద్దుకు నేడు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసి సాంకేతిక పరమైన తదితర అంశాలపై చర్చించేందుకు కమిటీని నియమించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరిస్తూ విధివిధానాలు ఖరారుకు కమిటీ వేయడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడానికి నిర్ణయించడంతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి నేరుగా జీతం ఇచ్చేలా చర్యలు తీసుకునేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఉద్యోగుల ఆశలకు కార్యరూపం ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయన్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోన్న నవరత్నాలను, సంక్షేమ పథకాలను ఉద్యోగులంతా క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుంటారన్నారు.
మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
Published Tue, Jun 11 2019 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement