తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు | Ys Jagan Mohan Reddy wishes that Ugadi reinforces resolve to fight Corona | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

Mar 24 2020 8:47 PM | Updated on Mar 25 2020 9:18 AM

Ys Jagan Mohan Reddy wishes that Ugadi reinforces resolve to fight Corona - Sakshi

సాక్షి, అమరావతి : శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలన్నారు. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా ‘‘సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో వేడుకగా ’’ ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా మీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement