పెథాయ్‌ బాధితులకు అండగా ఉండండి | YS Jagan calls for party leaders to Stay behind the victims of Pethai | Sakshi
Sakshi News home page

పెథాయ్‌ బాధితులకు అండగా ఉండండి

Dec 19 2018 3:22 AM | Updated on Dec 19 2018 3:22 AM

YS Jagan calls for party leaders to Stay behind the victims of Pethai - Sakshi

సాక్షి, అమరావతి: పెథాయ్‌ తుపాను బాధితులకు పార్టీ నాయకులందరూ అండగా నిలవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన పెథాయ్‌ తుపాను ప్రభావం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

తీరందాటిన సమయంలో గాలుల వేగం, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రైతుల పరిస్థితిపై ఆయా ప్రాంతాల నాయకుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులతో ప్రతిపక్ష నేత ఫోన్లో మాట్లాడారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో తిరిగి నష్టాన్ని అంచనా వేయాలని, బాధితులకు, రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయి సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement