చంపేస్తానని బెదిరింపులు

Wife Protest Infront Of Husband House In PSR Nellore - Sakshi

మూడో రోజూ రాధ నిరసన   

ప్రకాశం, బుచ్చిరెడ్డిపాళెం: ఇంటి ముందు బైఠాయిస్తే చంపేస్తానని, వెళ్లిపోవాలని తన భర్త ప్రసాద్‌రెడ్డి, అత్తమామలు బెదిరిస్తున్నారని భార్య రాధ వాపోయింది. మూడో రోజు బుధవారం నిరసనలో ఆమె మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది. తన జీవితాన్ని ప్రసాద్‌రెడ్డి నాశనం చేశాడని, ఎలా బతకాలని కన్నీరుమున్నీరుగా విలపించింది. మూడు రోజులుగా నిరసన చేపడుతున్నానని, తనకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపింది. రాధకు మద్దతుగా సంగం మండలం జెండాదిబ్బ నేతలు నిరసనలో కూర్చున్నారు. రాధకు న్యాయం చేయాలని వారు కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top