కడదాకా తోడుంటానని తలపై చెయ్యేసి ఒట్టేసి... బతుకంతా నీడనిస్తానని తాళిబొట్టు సాక్షిగా మాట ఇచ్చి.. తనతో కలిసి ఏడడుగులు నడిచిన భర్త అర్థాంతరంగా కనుమరుగైతే ఆమె కన్నీరుమున్నీరయింది. తోడూనీడగా ఉండాల్సిన వాడు కానరాని లోకాలకు తరలిపోయి తనను ఒంటరి చేసినందుకు బోరున ఏడ్చింది. తిరిగిరాని లోకాలకు బయల్దేరిన భర్తకు తానే తుడి వీడ్కోలు పలకాలని భావించి అంతిమ సంస్కారాల్లో పాలుపంచుకుంది. కుటుంబ సభ్యులు వారిస్తున్నా కాదని కన్నీళ్లతో అంత్యక్రియలు నిర్వర్తించి భార్యాభర్తల బంధానికి కొత్త అర్థాన్ని చెప్పింది.
రోలుగుంట : దశాబ్దానికి పైగా సాగిన ఆ కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. అనారోగ్యం రూపంలో భర్తను కాటేసింది. మృత్యువు పగబట్టి ఆ బంధాన్ని విడదీసింది. విశాఖ జిల్లా మండల కేంద్రం రోలుగుంటలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న ఆడారి అప్పారావు జీవితం అస్వస్థత కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. పదేళ్లుగా అప్పారావు, అరుణల వైవాహిక జీవితం ఉన్నంతలో సాఫీగా సాగింది. పదేళ్లకు పైగా తనతో తోడూనీడగా నడిచిన భర్త ఏడాది అనారోగ్యం తర్వాత తిరుగురాని లోకాలకు వెళ్లే సరికి అరుణ గుండెలవిసిపోయే విధంగా రోదించింది. అన్నీ తానైన భర్త కనుమరుగైన తన దురదృష్టాన్ని తలచుకుని కుమిలిపోయింది. ఇంతకాలం తనకు ఆసరాగా నిలిచిన భర్త రుణాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలని ఆమె తలచింది. బుధవారం భర్త అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా తాను అంతిమ క్రియల్లో పాల్గొంటానని చెప్పింది. అప్పారావు తోడబుట్టిన వారు, బంధువులు వారించినా కాదని తానే చితికి నిప్పంటించి భార్యగా రుణాన్ని తీర్చుకుంటానని పట్టుబట్టి తన మాట నెగ్గించుకుంది. మృతదేహాన్ని రుద్రభూమికి తీసుకెళ్లినపుడు దారి పొడవునా ముందు నడిచి, రుద్రభూమిలో భర్త భౌతిక దేహం చుట్టూ కుండతో మూడు సార్లు ప్రదక్షిణ చేసి చితికి నిప్పు అంటించింది. గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు ఆమె వెంట రుద్రభూమికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
భర్తకు అంతిమ సంస్కారాలు చేసిన భార్య
Published Thu, Jul 7 2016 11:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement