'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం' | We deference with bhuma family, says independent candidates in allagadda by election | Sakshi
Sakshi News home page

'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం'

Oct 24 2014 1:00 PM | Updated on Apr 4 2019 3:02 PM

తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు.

కర్నూలు: తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అంటే ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు  ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిరువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. 

భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి నిలపలేదు. అదికాక స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా తమ నామినేషన్ ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అభ్యర్థి, భూమా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement