నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: జిల్లాలో ఆదివారం గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 94 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35,608 మంది వీఆర్ఓ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 31,932 మంది హాజరయ్యారు. 3,676 మంది గైర్హాజరయ్యారు. 2,352 మంది వీఆర్ఏ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 2,045 హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 59 మంది వికలాంగులు పరీక్షలు రాశారు. గ్రామ రెవెన్యూ అధికారుల పరీక్షలకు 89.67, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలకు 86.95 శాతం హాజరైనట్లు డీఆర్వో రామిరెడ్డి వెల్లడించారు.
చివరి నిమిషం వరకు ఉత్కంఠ
జిల్లాలో జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు చివరి నిమిషం వరకు ఉత్కంఠత కలిగించాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని ఒక పక్క అధికారులు ప్రకటనలు గుప్పించినా ఫలితం లేకుండా పోయింది. ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది అభ్యర్థులు సమయానికి ఆయా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. సమయం దాటిపోవడంతో అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.
ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను
అనుమతించని పోలీసులు
నెల్లూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు సంబంధించి వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన వీఆర్వో పరీక్షకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషానికి చేరుకున్నప్పటికీ గేట్లు మూసి ఉండటంతో అక్కడి సిబ్బంది, పోలీసులను బతిమలాడిన, భంగపడినా ప్రయోజనం లేకపోయింది. నగరంలో డీకే కళాశాల కేంద్రంలో ఈ పరిస్థితిని అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎదుర్కొన్నారు.
నమ్ముకున్న ట్రైన్లు, బస్సులు సకాలంలో రాకపోవడం, నగరంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరు కాలేకపోయారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు టంచన్గా 10 గంటలకు పోలీసులు గేట్లు మూసివేశారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యంగా పరుగు పరుగున వచ్చిన పలువురు అభ్యర్థులు తమ ఆలస్యానికి గల కారణాలను ఏకరువు పెట్టినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశ, నిస్పృహలతో వెనుదిరిగారు. కొందరు మహిళలు కన్నీళ్ల పర్యంతమై నిస్సహాయంగా ప్రాధేయపడటం కనిపించింది.
ప్రశాంతంగా వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు
Published Mon, Feb 3 2014 3:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement