టీడీపీ నేత లా కాలేజీలో విజిలెన్స్‌ తనిఖీలు

Vigilance Officials Raid On TDP Leader Law College In Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: జిల్లాలోని టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి చెందిన న్యాయ కళాశాలలో కేంద్ర విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్‌ విద్యార్థిగా తన న్యాయ కళాశాలలోని సిబ్బంది అడ్మిషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఓ కేసు విచారణలో తమిళనాడుకు చెందిన ఉద్యోగికి టీడీపీ నేత లా కళాశాలలో అడ్మిషన్‌ ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. అయితే కోర్టు ఆదేశాలతో కళాశాలలో తనిఖీలు చేపట్టినట్టు కేంద్ర విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top