సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma Meets CM YS Jagan Mohan Reddy At AP Secretariat - Sakshi

సాక్షి,  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన అనంతరం వాసిరెడ్డి పద్మ తొలిసారి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్‌ జగన్‌కు వాసిరెడ్డి పద్మ ప్రత్యేక కృతజ‍్క్షతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయాలని సీఎం చెప్పారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top