నినదిస్తూ.. నిలదీస్తూ.. | united andhra movement | Sakshi
Sakshi News home page

నినదిస్తూ.. నిలదీస్తూ..

Aug 18 2013 5:13 AM | Updated on Sep 1 2017 9:53 PM

సమైక్యాంధ్ర నినాదాలతో ‘పశ్చి మ’ హోరెత్తుతోంది. ఉద్యమ పథంలోకి రాని రాజకీయ పార్టీల నాయకుల్ని నిలదీ స్తూ ప్రజాశ్రేణి ముందుకు సాగుతోంది. ఎన్జీవోల ఉద్యమ స్ఫూర్తి ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోంది. 18వ రోజైన శనివారం అన్నిచోట్లా వినూత్న పంథాలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి

 ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర నినాదాలతో ‘పశ్చి మ’ హోరెత్తుతోంది. ఉద్యమ పథంలోకి రాని రాజకీయ పార్టీల నాయకుల్ని నిలదీ స్తూ ప్రజాశ్రేణి ముందుకు సాగుతోంది. ఎన్జీవోల ఉద్యమ స్ఫూర్తి ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోంది. 18వ రోజైన శనివారం అన్నిచోట్లా వినూత్న పంథాలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ప్రభు త్వ శాఖల ఉద్యోగులతో జేఏసీలు ఏర్పాటవుతుండటంతో ఉద్యమం మరింతగా వేడెక్కుతోంది. పెనుమంట్ర మండలం మార్టేరులో రైతు సత్తి చంద్రారెడ్డి ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సా ర్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరింది.
 
  ఏలూరు నగ రంలో జేఏసీ  ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించాయి.  జేఏసీ నాయకులు ఎల్.విద్యాసాగర్, జీవీవీ సత్యనారాయణ, ఆర్‌ఎస్ హరనాథ్,చోడగిరి శ్రీనివాస్ ప్రదర్శనలో పాల్గొన్నారు. 108 ఉద్యోగులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరి మానవహారం ఏర్పాటు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోర్టులోని ఉద్యోగులందరూ ప్రదర్వన నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు భారీ ర్యాలీ చేశారు. ఐఏడీపీ హాలు వద్ద వ్యవసాయ అధికారుల సంఘం, ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ భవన్ వద్ద సర్వేయర్‌లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి.
 
 పాలాభిషేకాలు.. ప్రదర్శనలు...
 ఏలూరు, పరిసర గ్రామాలకు చెందిన  పాల వ్యాపారులు మోటారు సైకిళ్ళ ర్యాలీని తీన్ మార్ వాయిద్యాలతో నిర్వహించారు. వైఎంహెచ్‌ఏ హాలు వద్ద తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి 50 లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదుటికి సమైక్యాంధ్ర రిబ్బన్లు కట్టుకుని పాల క్యాన్‌లను భుజానికి ఎత్తుకొని సమైంక్యాంధ్ర  ఉద్యమంలో   భాగస్వాములం అవుతామంటూ  నినాదాలు చేశారు.
 
 500 అడుగుల జెండాతో ప్రదర్శన
 భీమవరంలో శశి మెరిట్ స్కూల్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు 500 అడుగుల జాతీయజెండా ను ప్రదర్శించారు. వీరమ్మ పార్కు వద తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.   వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. నాయకులు గ్రంధి వెంకటేశ్వరరావు, కోడే యుగంధర్  కేసీఆర్ దిష్టి బొమ్మను ప్రకాశంచౌక్‌లో దహనం చేశారు. రాష్ట్రాన్ని సమై క్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వికలాంగుడు కేతా శ్రీనివాసరావు మోటారు సైకిల్‌పై చేస్తున్న యాత్రకు భీమవరంలో జేఏసీ నాయకులు స్వాగతం పలికి అభినందించారు. మునిసిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగుల  రిలే దీక్షా శిబిరంలో మునిసిపల్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కృష్ణమోహన్  ప్రసంగించా రు. నరసాపురం మండలం రుస్తుంబాద లెప్రసీ కాలనీకి చెందిన 23 కుటుంబాలకు చెందిన పిల్లలు, మహిళలు, వృద్ధులు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా  శిబిరం వద్ద కేసీఆర్‌ను ఉరితీస్తున్నట్లు, సోని యా  రాక్షస అవతారంతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.
 
 రోడ్లపై వంటావార్పులు
 పాలకొల్లులో  శునకానికి సన్మానం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుడ్గాజంగాలు, నీటిపారుదల శాఖ సిబ్బంది, టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లు, యజమానులు ర్యాలీలు చేశారు. పోడూరు మండలం కవిటంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అత్తిలిలో ముస్లింలు మానవహారం ఏర్పాటు చేశారు. ఇరగవరంలో టీచర్లు వంటావార్పు చేశారు.  జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆచంట, పెనుగొండ బంద్ విజయవంైతమెంది. పెనుమంట్రలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పులో మహిళా సర్పంచ్‌లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొవ్వూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మెరకవీధిలోని ఈజీకే రోడ్డుపై దళిత సంఘాల నాయకులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ, నిడదవోలు-పంగిడి రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. జంగారెడ్డిగూడెం రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, కర్రా రాజారావు ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు
 
 ఆటలతో వినూత్న నిరసన
 యలమంచిలి మండలం చించినాడలో జాతీయ రహదారిపై మహిళలు కబడ్డీ ఆడి, వంటావార్పు చేసి  నిరసన వ్యక్తం చేశారు. తణుకులో జుట్టు కార్మికులు రోడ్డుపై కర్రసాము, యోగా విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు.  తణుకు వైజంక్షన్ వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ ఉద్యోగులు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులపై ఎక్కి ప్రదర్శన చే శారు.  ప్రజ్ఞ స్కూల్  ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డుపై పాఠాలు చెప్పారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుపై అర్ధనగ్నంగా స్నానాలు చేశారు. జేఏసీ శిబిరాన్ని సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు సందర్శించి సంఘీబావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement