తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు.. | Umareddy Venkateshwarlu critises Chandrababu Naidu on Farmer debt Waiver | Sakshi
Sakshi News home page

తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..

Jul 21 2014 8:07 PM | Updated on Jun 4 2019 5:04 PM

తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు.. - Sakshi

తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..

కోటయ్య కమిటీ నివేదిక రుణమాఫీని నీరుగార్చేలా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.

గుంటూరు: కోటయ్య కమిటీ నివేదిక రుణమాఫీని నీరుగార్చేలా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై  కోటయ్య ఇచ్చిన రిపోర్టు కాదు.. అది టీడీపీ నేతలు రాయించిన కోటయ్యకు ఇచ్చిన రిపోర్టు మాత్రమేనని ఉమారెడ్డి అన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన తొలి సంతకానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన తీవ్రంగా స్పందించారు. బాగా పనిచేసే కార్పొరేషన్లను తాకట్టు పెట్టే యోచనను విరమించుకోవాలని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హితవు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement