భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్ | Two smugglers arrested, huge red scandals seized at Kadapa district | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్

Jan 11 2015 8:04 AM | Updated on Aug 21 2018 7:18 PM

పోలీసులు కడప జిల్లాలోని ఒబులావారిపల్లె మండలం గాదెలలంక వద్ద భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కడప: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ వ్యవహారం యధెచ్చగా కొనసాగుతోంది. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఇటు పోలీసు యంత్రాంగం అటు అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ చర్యలో భాగంగా అందిన సమాచారం మేరకు పోలీసులు కడప జిల్లాలోని ఒబులావారిపల్లె మండలం గాదెలలంక వద్ద భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ రూ. కోటీ రూపాయలు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులపై ప్రతిదాడికి దిగారు. దాంతో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, 20 మంది పరారైనట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement