breaking news
Red scandals seized
-
అరటిగెలల మధ్య ఎర్ర చందనం..
అనంతపురం : ఎర్ర చందనం స్మగ్లర్లు తమ పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. తాజాగా వాహనంలో అరటి గెలల మధ్య ఎర్రచందనాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పెనుకొండ మండలం హరిపురం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం బయటపడింది. కాగా స్మగర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్
-
భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్
కడప: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ వ్యవహారం యధెచ్చగా కొనసాగుతోంది. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఇటు పోలీసు యంత్రాంగం అటు అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ చర్యలో భాగంగా అందిన సమాచారం మేరకు పోలీసులు కడప జిల్లాలోని ఒబులావారిపల్లె మండలం గాదెలలంక వద్ద భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. కోటీ రూపాయలు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులపై ప్రతిదాడికి దిగారు. దాంతో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, 20 మంది పరారైనట్టు పోలీసులు తెలిపారు.