రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం | Two couple attempt to commit suicide | Sakshi
Sakshi News home page

రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం

Oct 15 2014 5:18 PM | Updated on Apr 4 2019 4:46 PM

రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం - Sakshi

రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా బాపట్లలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యాయత్నం చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్లలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రత్యూష, దుర్గ అనే విద్యార్థినులను గోపిరెడ్డి, శివసత్యనారాయణలు ప్రేమించారు. ఆడపిల్లలు ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన  మైనర్లు. ఇంటర్ చదువుతున్నారు.  గోపిరెడ్డి విద్యార్థి అని, శివసత్యనారాయణ ఏ పనీలేకుండా తిరుగుతుంటాడని తెలుస్తోంది.

వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో కలిసి చనిపోవాలని నలుగురూ అనుకున్నారు. బాపట్ల శివారులోకి వెళ్లి  నలుగురూ పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి, 108 వాహనానికి  సమాచారం ఇచ్చారు. వాహనం వెంటనే వచ్చి వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో వారు  చికిత్స పొందుతున్నారు. అయితే ప్రత్యూష, దుర్గ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement