అంతటా గుప్పుమంటున్న మన్యం గంజాయి
వరుసగా వెలుగు చూస్తున్న సంఘటనలు
ఏడాదిలో 14,602 కిలోలు స్వాధీనం
ఏవోబీలో రూ. కోట్లలో లావాదేవీలు
సాగు,రవాణా నియంత్రణలో ఎక్సైజ్శాఖ విఫలం
అందాల మన్యం అక్రమాలకు వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో ఏజెన్సీ అంతటా గంజాయి వాసన గుప్పుమంటోంది. రాష్ట్రం నలుమూలల తనిఖీల్లో విశాఖ మన్యం నుంచి దిగుమతి అవుతున్న గంజాయే పట్టుబడుతోంది. ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. ఎక్సైజ్, పోలీసులు దాడులు జరుపుతున్నా ఏటా రూ. వందల కోట్లపైనే ఈ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఎక్కువగా కర్నాటక, మహారాష్ట్ర, పెద్ద మొత్తంలో తమిళనాడు తరలిస్తున్నట్టు అంచనా. అధికారుల నిఘా కొరవడడం వల్లే ఈ పరిస్థితి అన్న వాదన ఉంది.
నర్సీపట్నం: ఏజన్సీలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను వినియోగిస్తున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రశర్మ తెలిపారు. ఇక్కడి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ ఏవోబీలో పెద్ద ఎత్తున సాగవుతోందన్నారు. ఖరీదైన శీలావతి రకాన్ని ఇక్కడ సాగు చేయడంతో విదేశాల్లోనూ దీనికి డిమాండ్ ఉంటోందన్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల సాగు, అక్రమ రవాణాను నిరోధించలేకపోతున్నామన్నారు. దాడులకు వెళ్లే సిబ్బందికి గిరిజనుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. అయినప్పటికీ 2.6లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. నిర్మూలనకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు.
గమత్తుగా రవాణా
Published Sat, Feb 28 2015 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement